వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంకా జైల్లో ఎన్నాళ్లు?: జగన్ లాయర్, ఎల్వీకి అక్షింతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఇంకెంత కాలం జైలులో ఉంచుతారని జగన్ తరఫు న్యాయవాది సిబిఐని ప్రశ్నించారు. ఎలాంటి కారణం చూపకుండా జగన్‌ను ఎనిమిది నెలలుగా జైలులో ఉంచుతున్నారని ఆయన సిబిఐ కోర్టుకు తెలియజేశారు. అక్రమాస్తుల కేసులో జగన్‌ను అరెస్టు చేశామని చెబుతున్న సిబిఐ ఇప్పటి వరకు అతనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం చూపించలేదన్నారు.

ఏ కారణం చూపకుండా జైలులో ఉంచడం సరికాదన్నారు. ప్రతి పద్నాలు రోజులకు ఓసారి రిమాండును పొడిగిస్తున్నారని ఆక్షేపించారు. సిబిఐ తన దర్యాఫ్తును ఎప్పుడు పూర్తి చేస్తోందో? ఎప్పుడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేస్తుందో? తెలియకుండా ఉందన్నారు. సిబిఐ తన ఆఖరి ఛార్జీషీట్ ఎప్పుడు దాఖలు చేయనుందో? దర్యాఫ్తు ఎప్పుడు పూర్తి చేస్తారో? స్పష్టంగా చెప్పాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో సిబిఐని ప్రశ్నించారు.

జగన్‌ని అలాగే జైలులో ఉంచేందుకు సిబిఐ తగిన కారణాలను చూపించడం లేదన్నారు. ఇది సరికాదన్నారు. కాగా ఎమ్మార్, జగన్ కేసు, ఓఎంసి కేసుల నిందితుల రిమాండు నేటితో ముగియడంతో సిబిఐ కోర్టు వారిని ఈ రోజు విచారించింది. జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, గాలి జనార్ధన్ రెడ్డి తదితరులను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది.

విజయ సాయి రెడ్డి, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు కోర్టుకు హాజరయ్యారు. పెళ్లి ఉందని చెప్పి మంత్రి ధర్మాన ప్రసాద రావు హాజరు కాలేదు. నిందితులను విచారించిన కోర్టు వారికి ఈ నెల 27వ తేది వరకు రిమాండును పొడిగించింది. కాగా గతంలో కోర్టుకు హాజరు కానీ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై కోర్టు మండిపడింది. ఎందుకు కోర్టుకు హాజరు కాలేదో వివరించాలని ఆదేశించింది.

English summary
Jagan's lawyer questions CBI
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X