హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో భేటీ: వ్యతిరేక కార్యకలాపాలని మరొకరిపై వేటు

By Srinivas
|
Google Oneindia TeluguNews

TDP Logo
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు పైన పార్టీ అధిష్టానం గురువారం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. బొడ్డు భాస్కర రామారావు ఈ రోజు ఉదయం అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఆయనపై వేటు వేసింది.

గతంలో జగన్‌ను కలిసిన పలువురు నేతలను తెలుగుదేశం వెంబటే వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి మొదలు ఇప్పుడు భాస్కర రామారావు వరకు జైల్లో జగన్‌ను కలిసిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలపై ఆలస్యం చేయకుండా పార్టీ వేటు వేసింది.

కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరి నచ్చకపోవడం వల్లనే తాను ఆ పార్టీని వీడినట్లు ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు గురువారం చెప్పిన విషయం తెలిసిందే. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఎప్పుడు చేరే విషయం త్వరలో తెలియజేస్తానని అన్నారు. తాను పార్టీని వీడినప్పటికీ కార్యకర్తలు కూడా తన వెంటే ఉన్నారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికి చేరాయన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన జోస్యం చెప్పారు. వైయస్ పథకాలు కొనసాగించడం ఒక్క జగన్‌కే సాధ్యమన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆరోపించారు. వైయస్ జగన్‌కు అండగా ఉండాలని తాను నిర్ణయించుకున్నట్లు చెప్పారు. జైల్లో ఉన్న జగన్‌ను కలిసిన తాను ఆయనతో తన అభిప్రాయాలు పంచుకున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదని ఆయన ఆరోపించారు. సమైక్యవాదంపై టిడిపి వైఖరి తనకు నచ్చలేదన్నారు.

English summary

 MLC Boodu Bhaskara Ramarao was suspended from Telugudesam Party on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X