ఇది బాబు పాలన రెండోభాగం: కిరణ్పై షర్మిల, జగనొస్తే..

జగన్ను ముఖ్యమంత్రి చేస్తే వడ్డీలేని రుణాలతోపాటు వృద్ధ్దులకు రూ.700, వికలాంగులకు రూ. 1000 పింఛన్ అందజేస్తారన్నారు. విద్యుత్ ఛార్జ్జీలను పెంచి, రాష్ట్ర ప్రజలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ రూ.34వేల కోట్ల భారాన్ని వేసిందన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బాబు ఇష్టం చూపడం లేదన్నారు.
బాబు అవిశ్వాసం పెట్టకుండా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పథకాలకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ హయాంలో విద్యుత్ సరఫరా చక్కగ లేదన్నారు. విద్యుత్ సరిగా లేకున్నా బిల్లు బాగా వస్తుందని, అది కట్టకుంటే పోలీసు స్టేషన్కు ఈడ్చుకెళ్లి మెడ మీద లాఠీ పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
అధికార కాంగ్రెసు పార్టీతో తెలుగుదేశం పార్టీ కుమ్మక్కైందన్నారు. రైతుల బాధలు విన్నాక రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన కనిపిస్తోందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన చూస్తుంటే బాబు పరిపాలన రెండో భాగంగా అనిపిస్తోందన్నారు. బాబు తన పాలనలో ప్రజలను హింసించారని, ఇప్పుడు కిరణ్ హయాంలోను అదే జరుగుతోందన్నారు. బాబుకు పదవీ వ్యామోహం ఎక్కువ అన్నారు. కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచాడన్నారు.












Click it and Unblock the Notifications