అఫ్జల్‌కే పదేళ్లు పట్టింది: నెల్లూరులో హత్యలకు నిరసన

Murder
నెల్లూరు/హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని హరినాథపురంలో జరిగిన జంట హత్యలకు నిరసనగా విద్యా సంఘాలు ఇచ్చిన బందు కొనసాగుతోంది. పరీక్షలు ఉన్న విద్యాసంస్థలు మినహా అన్నీ మూతపడ్డాయి. విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిందితులను ఉరితీయాలంటూ వారు డిమాండ్ చేశారు.

మరోవైపు బంద్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. నగర వ్యాప్తంగా విద్యాసంస్థలు ఆందోళనకు దిగాయి. పలు మహిళా సంఘాలు ఆందోళలో పాల్గొన్నాయి. ఉగ్రవాదులు అయిన అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్‌లలో ఒకరికి పదేళ్ల తర్వాత మరొకరికి నాలుగేళ్ల తర్వాత ఉరిశిక్ష పడిందని అలాంటిది భార్గవి, శకుంతలను చంపిన నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుందో చెప్పలేమన్నారు.

కాబట్టి వారిని బహిరంగంగా పోలీసులు కాల్చి పారేయాలని వారు డిమాండ్ చేశారు. జంట హత్యల కేసులో సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకు లేదన్నారు. అందుకే వారిని వెంటనే కాల్చి వేయాలని విద్యార్థులు, మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. కాగా మూడు రోజుల క్రితం ఫార్మసీ కళాశాల యజమాని దినకర్ రెడ్డి ఇంట్లో దుండగులు కత్తితో దాడి చేసిన ఘటనలో ఆయన భార్య, కూతురు మృతి చెందిన విషయం తెలిసిందే.

హైదరాబాదులో వివాహిత ఆత్మహత్య

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని రామంతపూర్‌లో మంజుల వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులే కారణమని మంజుల బంధువులు ఆమె భర్త, అత్తమామలపై దాడికి దిగారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ ఘటనలో పోలీసు వాహనం స్వల్పంగా ధ్వంసమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+