షర్మిలకు తెలంగాణ సెగ: చంద్రబాబూ! డ్రామాలు ఆపి

షర్మిల పాదయాత్ర నియోజకవర్గంలోని అనుముల, నిడమనూరు మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె పలు ప్రాంతాల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు పన్నులు ఎడాపెడా పెంచి ప్రజల రక్తం పిండుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల సమస్యలు తీర్చాలంటే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన రావాలని, తన సోదరుడు జగన్తోనే అది సాధ్యమని ఆమె అన్నారు.
వైయస్ చనిపోయాక ప్రజా సమస్యలను పట్టించుకునే వారే లేరన్నారు. రోజుకు రెండు గంటలు కూడా కరెంటు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ప్రజల గోడు వినిపిస్తున్నట్లుగా లేదన్నారు. అదే అయితే, ఆయన కిరణ్ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టేవారని షర్మిల విమర్శించారు. పాదయాత్రతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా కిరణ్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని హితవు పలికారు. చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో చేస్తున్న పాదయాత్ర డ్రామాలు ఆపాలన్నారు. అవసరమైతే అవిశ్వాసం పెడతామని బాబు చెప్పారని, ఆయనకు అవసరమైతేనా? లేక ప్రజలకు అవసరమైతేనా? చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications