మజ్లీస్ ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై మరో కేసు నమోదు

జాతిపిత మహాత్మాగాంధీతోపాటు భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యే మాట్లాడారని జగిత్యాలకు చెందిన హైకోర్టు న్యాయవాది ఎన్నంపల్లి గంగాధర్ జగిత్యాల క్రిమినల్ కోర్టులో ఈనెల 6న పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్పై స్పందించిన జడ్జి కల్పన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పాషా ఖాద్రీపై జగిత్యాల టౌన్ పోలీసులు 121ఏ, 124ఏ, 153ఏ, 323, 334, 499, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు.
శానససభ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహ ప్రతిష్టాపనపై పాషా ఖాద్రీ జనవరి 17వ తేదీన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఇప్పటికే హైదరాబాదులోని ఛత్రినాక పోలీసు స్టేషన్లో కూడా పాషా ఖాద్రీపై కేసు నమోదైంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకుడు పి. లక్ష్మణ్ పాషా ఖాద్రీ వ్యాఖ్యలపై కోర్టుకు ఎక్కారు. పాషా ఖాద్రీపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దీంతో స్థానిక కోర్టు ఆదేశాల మేరకు ఛత్రినాక పోలీసులు పాషా ఖాద్రీపై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications