నేనే పోటీ చేస్తా: పురంధేశ్వరికి టిఎస్సార్ ఝలక్

పురంధేశ్వరిని నర్సారావుపేట నుంచి పోటీకి దింపాలనే ఆలోచనలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఉందని టిఎస్సార్ అన్నారు. స్థానిక పరిస్థితులు, ప్రజలతో ఉన్న సంబంధాల ఆధారంగానే లోకసభకు పోటీ అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన అన్నారు.
విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి గతంలో టి. సుబ్బిరామిరెడ్డి గతంలో పోటి చేసి గెలిచారు. 2009 ఎన్నికల్లో ఆ సీటును కాంగ్రెసు అధిష్టానం దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించింది. అక్కడి నుంచి పోటీ చేసి ఆమె విజయం సాధించారు. ఆమె విశాఖపట్నం నుంచి మారడానికి అయిష్టత వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ముందు విశాఖపట్నం సీటు నుంచి పోటీ చేసే విషయంపై పురంధేశ్వరికి, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన పురంధేశ్వరి, నెల్లూరు జిల్లాకు చెందిన టి. సుబ్బిరామిరెడ్డి విశాఖపట్నం సీటు కోసం పోటీ పడడం ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయమే. సుబ్బిరామిరెడ్డి చాలా కాలంగా విశాఖపట్నంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications