విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళా శవాన్ని షెల్ఫ్‌లో కుక్కి ప్లాస్టరింగ్ చేశారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman murdered in Visakhapatnam
విశాఖపట్నం: విశాఖపట్నంలోని రెడ్డి కంచరపాలెంలో ఇటీవల అదృశ్యమైన మహిళ ఓ పెయింటర్ ఇంట్లో శవమై తేలింది. ఆమె మృతదేహాన్ని వంటగదిలోని ఓ షెల్ఫ్‌లో కుక్కి ప్లాస్టరింగ్ చేసేశారు. అయితే గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు సోమవారం రాత్రి కంచరపాలెం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంగళవారం పోలీసులు ప్లాస్టరింగ్‌ను తొలగించడంతో ఈ దారుణం బయటపడింది.

తిక్కవానిపాలేనికి చెందిన వాసుపల్లి అర్రమ్మ (45) చేపలు విక్రయిస్తుంటుంది. స్థానికంగా వడ్డీ వ్యాపారం కూడా చేసేది. ఈ నెల 12న చేపలు అమ్మేందుకు వెళ్లిన అర్రమ్మ తిరిగి ఇంటికి చేరకపోవడంతో ఆమె భర్త అప్పారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కప్పరాడకు చెందిన పెయింటర్ నీలాపు వేణు (25)కు ఏడాది క్రితం రమతో వివాహమైంది. ఈ జంట మాజీ కార్పొరేటర్ అప్పలరెడ్డి ఇంట్లో అద్దెకు దిగారు. అర్రమ్మ వద్ద వేణు కొంతమొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడని, ఈ విషయమై వీరిద్దరి మధ్య తరచూ ఘర్షణలు జరిగేవని మృతురాలి కుటుంబసభ్యులు తెలిపారు.

ఆరు నెలల గర్భవతి రమ ప్రసూతి కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో వేణుయే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
A woman has been murdered in Visakhapatnam and the accused is absonding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X