వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్ష్యులకు విజయసాయి బెదిరింపు, ఆధారాలు: సిబిఐ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vijaya Sai Reddy
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆడిటర్ విజయ సాయి రెడ్డి పాత్ర కీలకం అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) శుక్రవారం వాదించింది. విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ రోజు వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు కేసు విచారణను వచ్చే నెల 14వ తేదికి వాయిదా వేసింది.

వాదనల సందర్భంగా విజయ సాయి ఈ కేసులో కీలకం అని సిబిఐ సుప్రీం కోర్టుకు తెలిపింది. పెట్టుబడిదారులను ప్రభావితం చేసి బలవంతంగా వారిచే జగన్ కంపెనీలలో విజయ సాయి రెడ్డి పెట్టుబడులు పెట్టించారన్నారు. నిజా నిజాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు విజయ సాయి రెడ్డికి బెయిల్ ఇచ్చిందన్నారు. ఇంకా తుది ఛార్జీషీటు దాఖలు చేయాల్సి ఉందన్నారు.

విజయ సాయి రెడ్డి సాక్ష్యులను బెదిరిస్తున్నారన్నారు. ఆయన బయట ఉన్న సమయంలో తుది ఛార్జీషీట్ దాఖలు చేస్తే బెదిరిస్తారన్నారు. ఆయన బెదిరించినట్లుగా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. విజయ సాయి రెడ్డికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. ఆయన బెయిల్ రద్దు చేయకుంటే విచారణ సాఫీగా సాగదన్నారు.

హైకోర్టు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాకే సాయికి బెయిల్ ఇచ్చిందని విజయ సాయి రెడ్డి తరఫు న్యాయవాది చెప్పారు. ఆయన బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. సాయికి బెయిల్ ఇచ్చిన సిబిఐ రెండు ఛార్జీషీట్లను దాఖలు చేసిందన్నారు. ఆయన సాక్ష్యులను బెదిరించలేదన్నారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు విచారణను 14కు వాయిదా వేసింది.

English summary
Supreme Court adjourned YSR Congress Party chief and Kadapa MP YS Jaganmohan Reddy's auditor Vijaya Sai Reddy's bail cancel petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X