హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ టార్గెట్: వ్యూహాత్మక ఎంపిక, సరిహద్దుల్లో..

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఉగ్రవాదులకు లక్ష్యంగా మారుతోంది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాన్ని మరోసారి వాళ్లు టార్గెట్‌గా చేసుకున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వైఫల్యం వల్లే మళ్లీ మళ్లీ ఇలాంటి దౌష్ట్యాలకు వారు పాల్పడుతున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఒకసారి ఇరవై రెండు కిలోల ఆర్డీఎక్స్ పట్టుబడినప్పుడే ఇక్కడ ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉండాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పారు.

కానీ, అది ఇప్పటికీ అమలుకాలేదు. హైదరాబాద్‌లో గడిచిన ఇరవై ఏళ్లుగా 14 ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు నడుస్తున్నాయి. ప్రధానంగా లష్కరే తాయిబా.. దానికి అనుబంధంగా మరికొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. తాజా పేలుళ్లలో ఉగ్రవాదులు వ్యూహత్మకంగానే దిల్‌సుఖ్‌నగర్‌ను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇటు జిల్లాలకు వెళ్లేవారు బస్సుల కోసం వేచి ఉండే ప్రాంతంతో పాటు విద్యాసంస్థలు కూడా ఉండటం.. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల నష్టం కూడా భారీగా ఉంటుందన్న అంచనాతోనే ఉగ్రవాదులు పేలుళ్లకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే నిత్యం రద్దీగా ఉండే కోణార్క్ థియేటర్ వద్ద, వెంకటాద్రి థియేటర్ వద్ద బాంబులు పెట్టారు. గతంలో దిల్‌సుఖ్ నగర్‌ను లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

కాగా, పేలుళ్లలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి రూ.50 వేల నుండి రూ.లక్ష వరకు, మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జరిగిన సంఘటనపై పలువురు నేతలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన సాయం అందుతుందని సోనియా, ప్రధాని చెప్పారు.

English summary
Blasts have taken place at Dilsukhnagar in Hyderabad opposite bus depot. It is said that 15 persons have succumbed to the injuries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X