హైదరాబాద్ టార్గెట్: వ్యూహాత్మక ఎంపిక, సరిహద్దుల్లో..
కానీ, అది ఇప్పటికీ అమలుకాలేదు. హైదరాబాద్లో గడిచిన ఇరవై ఏళ్లుగా 14 ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు నడుస్తున్నాయి. ప్రధానంగా లష్కరే తాయిబా.. దానికి అనుబంధంగా మరికొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి. తాజా పేలుళ్లలో ఉగ్రవాదులు వ్యూహత్మకంగానే దిల్సుఖ్నగర్ను ఎంపిక చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇటు జిల్లాలకు వెళ్లేవారు బస్సుల కోసం వేచి ఉండే ప్రాంతంతో పాటు విద్యాసంస్థలు కూడా ఉండటం.. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల నష్టం కూడా భారీగా ఉంటుందన్న అంచనాతోనే ఉగ్రవాదులు పేలుళ్లకు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అందులో భాగంగానే నిత్యం రద్దీగా ఉండే కోణార్క్ థియేటర్ వద్ద, వెంకటాద్రి థియేటర్ వద్ద బాంబులు పెట్టారు. గతంలో దిల్సుఖ్ నగర్ను లక్ష్యంగా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.
కాగా, పేలుళ్లలో గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారికి రూ.50 వేల నుండి రూ.లక్ష వరకు, మృతి చెందిన కుటుంబాలకు రూ.6 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. జరిగిన సంఘటనపై పలువురు నేతలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన సాయం అందుతుందని సోనియా, ప్రధాని చెప్పారు.