హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేలుళ్లు మా పనే: కిషన్‌రెడ్డికి లష్కరే బెదిరింపు లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌సుఖ్ నగర్ పేలుళ్లు తమ పనేనంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట నియోజకవర్గ శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి లష్కరే తోయిబా పేరుతో బెదిరింపు లేఖ వచ్చింది. ఈ విషయాన్ని కిషన్ రెడ్డి ఆదివారం చెప్పారు. లష్కరే తోయిబా పేరుతో బిజెపి కార్యాలయానికి ఓ బెదిరింపు లేఖ వచ్చిందని చెప్పారు.

దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుడు తమ పనేనని ఆ లేఖలో పేర్కొన్నట్లుగా ఆయన చెప్పారు. బాంబు పేలుడు తమ పనేనని, తర్వాత తమ టార్గెట్ బేగంబజార్ అని అక్కడ కూడా త్వరలో దాడి చేస్తామని లేఖలో హెచ్చరించారని కిషన్ రెడ్డి చెప్పారు. తమకు వచ్చిన లేఖ పైన అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

కర్నాటకలో దర్యాఫ్తు

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల ఘటన నిందితులు కర్నాటకలో తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నారు. దీంతో రెండు ఎన్ఐఏ బృందాలు బెంగళూరులో దర్యాఫ్తు కొనసాగిస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి కర్నాటకలో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నేరాలు, దాడులకు పాల్పడేవారు తప్పించుకోకుండా కఠినమైన చర్యలు తీసుకునేందుకు చట్టాల్లో మార్పులు తీసుకురావాలని మంత్రి టిజి వెంకటేష్ విజయవాడలో అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

English summary
BJP state officer receives letter on the name of Lashkar e taiba.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X