వ్యక్తితో సంబంధం: ఏడిపిస్తున్నారంటూ సోదరి హత్య
దీంతో అతను గత శుక్రవారం ఆమె ఇంటికి వెళ్లి మనుతో సంబంధాన్ని కొనసాగించవద్దని హెచ్చరించాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన అరుణ్ ఆమె గొంతును నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు.
తన సోదరితో మోనుకు గల సంబంధం పైన అతని స్నేహితులు తనను తరుచూ ఏడిపించే వారని అతను పోలీసులకు చెప్పాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ముంబయిలో..
మహారాష్ట్రలో ఏడో తరగతి విద్యార్థినిని అత్యాచారం చేసిన ఘటనలో ఓ ఉపాధ్యాయుడిని మహారాష్ట్ర బాలాటి జిల్లాలోని లందుర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విద్యార్థిని బస్సు కోసం చూస్తుండగా సైకిల్ పైన తీసుకెళ్తానని చెప్పిన ఉపాధ్యాయుడు ఆమెను సమీప గ్రామానికి తీసుకు వెళ్లాడు.
అక్కడ ఆమెపై అత్యాచారం చేసాడు. బాధితురాలు స్పృహలోకి వచ్చాక ఆమె ఇంటి వద్ద దింపేశాడు. విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులు గ్రామ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు. వారు పోలీసులకు చెప్పారు. పోలీసులు ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.