హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీసుల అదుపులో రయీసుద్దీన్: సూత్రధారి ఖాజీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayees Uddin grilled by Police
హైదరాబాద్/బెంగళూరు: దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి ఓ అనుమానితుడిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్టకు చెందిన రయీసుద్దీన్ అనే యువకుడిని ఆదివారం ఉదయం పోలీసులు అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించారు. జంట పేలుళ్లకు సంబంధించి అతనిపై అనుమానాలు ఉండటంతో అతనిని మరింత విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

రసీయుద్దీన్ మక్కా పేలుళ్ల ఘటనలోను పోలీసులు లిస్టులో ఉన్నాడు. సైబరాబాద్ పోలీసులతో పాటు ఎన్ఐఏ బృందం కూడా అతనిని విచారించినట్లుగా సమాచారం. అతని వద్ద నుండి దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించిన అంశంపై కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు బెంగళూరులోని జైలులో ఉన్న పలువురిని ఎన్ఐఏ ఆదివారం విచారించింది.

15 మంది అనుమానితులను బెంగళూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు పోలీసుల చేతిలో అరెస్టయిన వారిలో హైదరాబాదుకు చెందిన ఒబెదుల్లా రెహ్మాన్ కూడా ఉన్నారు. అతనిని ఎన్ఐఏ బృందం విచారించినట్లుగా తెలుస్తోంది.

కాగా, దిల్‌సుఖ్ నగర్ జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఫయాజ్ ఖాజీని కీలక సూత్రదారిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కుట్రకు పాల్పడ్డ యాసిన్ బత్కాల్‌కు ఫయాజ్ ఖాజీనే పూర్తి సహకారం అందించినట్లుగా భావిస్తున్నారు.

English summary

 Rayees Uddin grilled by Police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X