పోలీసుల అదుపులో రయీసుద్దీన్: సూత్రధారి ఖాజీ
రసీయుద్దీన్ మక్కా పేలుళ్ల ఘటనలోను పోలీసులు లిస్టులో ఉన్నాడు. సైబరాబాద్ పోలీసులతో పాటు ఎన్ఐఏ బృందం కూడా అతనిని విచారించినట్లుగా సమాచారం. అతని వద్ద నుండి దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లకు సంబంధించిన అంశంపై కూపీలాగే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మరోవైపు బెంగళూరులోని జైలులో ఉన్న పలువురిని ఎన్ఐఏ ఆదివారం విచారించింది.
15 మంది అనుమానితులను బెంగళూరు పోలీసులు గతేడాది అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బెంగళూరు పోలీసుల చేతిలో అరెస్టయిన వారిలో హైదరాబాదుకు చెందిన ఒబెదుల్లా రెహ్మాన్ కూడా ఉన్నారు. అతనిని ఎన్ఐఏ బృందం విచారించినట్లుగా తెలుస్తోంది.
కాగా, దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిద్దీన్ సంస్థకు చెందిన ఫయాజ్ ఖాజీని కీలక సూత్రదారిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కుట్రకు పాల్పడ్డ యాసిన్ బత్కాల్కు ఫయాజ్ ఖాజీనే పూర్తి సహకారం అందించినట్లుగా భావిస్తున్నారు.