ఆ పేలుళ్లు వైయస్ హయాంలోనే: షర్మిలకు కౌంటర్

2007లోని పేలుళ్లు వైయస్ హయాంలోనే జరిగాయనే విషయాన్ని ఆమె మర్చిపోయారా అని ప్రశ్నించారు. నిఘా వర్గాల సమాచారం ఉండి కూడా అప్పటి పేలుళ్లను నాడు వైయస్ ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. నాటి దాడుల్లో తీవ్రంగా గాయపడ్డవారు ఇప్పటికీ నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా పార్టీలు స్పందించి బాసటగా నిలవాలని కోరారు.
పరిపక్వత లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. స్వప్రయోజనాలకై కొన్ని శక్తులతో వైయస్ అనుసరించిన వైఖరే నేటి పరిణామాలకు కారణమన్నారు. ఐఎస్ఐ శక్తుల విచ్చలవిడితనానికి వైయస్ హయాంలోనే బీజం పడిందని ఆరోపించారు. ఈ విషయాన్ని గుర్తించి షర్మిల తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సిఎంకు దాడి లేఖ
రాష్ట్రంలో గత ఎనిమిదేళ్ళలో నాలుగు ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో 75 మంది మృతి చెందారని, 229 మందికి పైగా క్షతగాత్రులయ్యారని అయితే, బాధితులకు వైద్యసాయం, నష్టపరిహారాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టిడిపి సీనియర్ నాయకుడు దాడి వీరభద్ర రావు ధ్వజమెత్తారు. గతంలో జరిగిన విధ్వంసాలలో తీవ్రంగా గాయపడి ఇప్పటికీ కోలుకోలేకుండా ఉన్న బాధితులను తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!!












Click it and Unblock the Notifications