మహిళా టెక్కీ ఆత్మహత్య: గుండెపోటు, దిగిన విమానం
తన భర్త, సోదరుడు బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. రమ్య కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా రమ్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారని మియాపూర్ పోలీసులు చెప్పారు.
గుండెపోటు.. దిగిన విమానం
ప్రయాణీకురాలికి గుండెపోటు రావడంతో ఆదివారం ఓ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దింపారు. ఆమె విమానాశ్రయంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆదివారం దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఈకె-418 విమానం బ్యాంకాక్ బయలుదేరింది.
ఆస్ట్రేలియాకు చెందిన జోసబ్ ఇలినా(31) అనే మహిళను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఇదే విమానంలో బ్యాంకాక్ తీసుకెళ్తున్నారు. మార్గ మధ్యలోనే గుండెపోటు రావడంతో పైలట్ శంషాబాద్ విమానాశ్రయ అధికారుల అనుమతితో విమానం దింపారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
మౌలాలీలో హత్య
హైదరాబాదులోని మౌలాలీ ప్రాంతంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.