దిల్షుక్నగర్ పేలుళ్లు: సైకిల్ చేసిస్ నెంబర్తో క్లూస్
రెండు సైకిళ్లలో ఒక సైకిల్ చేసిస్ నెంబర్ స్పష్టంగా కనిపిస్తోందని, రెండో సైకిల్ చేసిస్ నెంబర్ను గుర్తించడంలో దర్యాప్తు అధికారులు విఫలమయ్యారని అంటున్నారు. దర్యాప్తునకు ఎంత వరకు ఉపయోగపడతుందో చెప్పలేం గానీ సైకిల్ యజమానిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు. రెండు సైకిళ్లు కూడా ఒకే రకంగా ఉన్నాయని, కొన్ని విడిభాగాలను మార్చారని అంటున్నారు.
కీలకమైన సిసిటీవి ఫుటేజ్ను అహ్మదాబాద్లోని ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపిస్తున్నారు. సైకిల్ కేరియర్పై బ్యాగ్ పెట్టుకుని వెళ్తున్న వ్యక్తిని గుర్తించడానికి హైదరాబాద్ పోలీసులు ఆ పని చేస్తున్నారు. ఆ వ్యక్తి కొన్ని నిమిషాల తర్వాత సైకిల్ లేదా బ్యాగ్ లేకుండా వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా సిసిటీవి కెమెరాలో రికార్డు అయింది.
ఫుటేజీని పెద్దది చేసి గుర్తించడానికి ప్రయత్నించామని, అయితే అది చాలా శ్రమతో కూడుకున్న పని అని, ఎఫ్బిఐ ఆ పనిని సులభంగా చేయగలదని, అయితే తొలుత దాన్ని అహ్మదాబాద్లోని ఫోరెన్సిక్ లాబోరేటరీకి పంపుతున్నామని సంబంధిత అధికారులు అంటున్నారు.
కేంద్ర దర్యాప్తు సంస్థ పెద్దది చేసిన ఫుటేజీని పంపించిందని, అయినా అది అంత స్పష్టంగా లేదు. ఎఫ్బిఐకి పంపించడమే తమకు చివరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ముఖాలను దాచుకోవడానికి స్కార్ఫ్ను గానీ, టోపీని గానీ ధరించి ఉంటారని అనుమానిస్తున్నారు.