దిల్షుక్నగర్ పేలుళ్లు: ఇద్దరి కస్టడీని కోరిన ఎన్ఐఎ
దీంతో ఇద్దరి కోసం న్యాయమూర్తి ప్రొడక్షన్ వారంట్స్ జారీ చేశారు. 2012 పూణే పేలుళ్ల కేసులో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి వారు తీహార్ జైలులో ఉంటున్నారు. మక్బూల్ను, ఇమ్రాన్ను తమ ముందు బుధవారంనాడు హాజరు పరచాలని న్యాయమూర్తి తీహార్ జైలు అధికారులను ఆదేశించారు.
మక్బూల్, ఇమ్రాన్ 2012 జులైలో దిల్షుక్నగర్ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఎ అనుమానిస్తోంది. పాకిస్తాన్లో ఉంటున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ సూచన మేరకు వారిద్దరు రెక్కీ నిర్వహించారని ఎన్ఐఎ అనుమానిస్తోంది. వారిద్దరినీ విచారిస్తే దిల్షుక్నగర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియగలవని ఎన్ఐఎ భావిస్తోంది.
ఈ నెల 21వ తేదీన హైదరాబాదులోని దిల్షుక్నగర్లో జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో 16 మంది మృతి చెందగా, వంద మందికి పైగా గాయపడ్డారు. వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ల వద్ద ఈ పేలుళ్లు సంభవించాయి.