జగన్పార్టీలోకి డిఎల్: వీరశివా శివాలు, చిరు మంత్రిపైనా

సహకార ఎన్నికల్లో ఓటమికి వారిద్దరే కారణమన్నారు. దీనిపై తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. కాంగ్రెసు ఓటమికి కారణమైన డిఎల్, రామచంద్రయ్యలను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. వారిని పార్టీ నుండి కూడా బహిష్కరించాలన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి డిఎల్ తొత్తులా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్ పార్టీకి చెందిన మైసూరా రెడ్డితో కలిసి డిఎల్, రామచంద్రయ్యలు సహకార ఎన్నికలకు ముందే కుట్ర చేశారని ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రహస్య ఒప్పందం చేసుకున్నారని మరో నేత వరదరాజులు రెడ్డి నిప్పులు చెరిగారు. డిఎల్ రవీంద్రా రెడ్డి ఆస్తుల పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయనకు ఇష్టమైతే ఆ పార్టీలోకి వెళ్లవచ్చునని అంతేకాని, కాంగ్రెసులో ఉంటూ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలను ఊరుకునేది లేదని కడప జిల్లా కాంగ్రెసు నేతలు హెచ్చరించారు.
కాగా ఇటీవల జరిగిన సహకార ఎన్నికల్లో కడప జిల్లాల్లో కాంగ్రెసు పార్టీ కంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ గెలుచుకుంది. కాంగ్రెసుకు డిఎల్ రవీంద్ర రెడ్డి, రామచంద్రయ్యలు సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరశివా రెడ్డి బుధవారం వారిపై ఒంటికాలిపై లేచారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications