వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చాపర్‌ డీల్‌పై జెపిసి: సిగ్గుపడుతున్నానని ఆంటోనీ

By Pratap
|
Google Oneindia TeluguNews

AK Antony
లక్నో: వివిఐపి చాపర్ డీల్‌పై విచారణకు ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. 30 మందితో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించిన తీర్మానానికి రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్ నాథ్ ప్రతిపాదించిన ప్రభుత్వ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి సభ్యులు వాకౌట్ చేశారు.

జెపిసిలో 20 మంది లోకసభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. మూడు నెలల్లోగా జెపిసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. వివిఐపి చాపర్ డీల్ వ్యవహారంపై జరిగిన చర్చపై అంతకు ముందు రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ మాట్లాడారు. హెలికాప్టర్ కుంభకోణం దోషులను కఠినంగా శిక్షిస్తామని, తప్పు చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెడతామని ఆయన చెప్పారు. ఈ కుంభకోణం పట్ల తాను సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు.

ఏదో ఒక కుంభకోణం బయటపడుతూ ఉండడం మనకు సిగ్గు చేటైన విషయమని మంత్రి అన్నారు వాస్తవాలు తెలుసుకుంటామని, తప్పు చేసినవారిని శిక్షిస్తామని ఆయన చెప్పారు. కుంభకోణం మూలాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పన్ను చెల్లింపుదారుల డబ్బులు వృధా కాకూడదని అన్నారు.

కుంభకోణంపై విచారణకు ఆదేశించడంలో జాప్యం జరుగుతుండడాన్ని బిజెపి తప్పు పట్టింది. లంచాలు తీసుకున్నవారిని శిక్షించాలని డిమాండ్ చేసింది. డీల్ కోసం 400 కోట్ల రూపాయల లంచాలు చేతులు మారాయని బిజెపి సభ్యుడు ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇటలీ పెట్టుబడిదారులు చెప్పిన కుటుంబం ఏదో దేశానికి తెలియాలని ఆయన అన్నారు.

English summary
The Rajya Sabha on Wednesday adopted a motion constituting a 30-member Joint Parliamentary Committee to probe the VVIP chopper deal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X