వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులో అత్యాచార బాధితురాలు ఆత్మహత్యాయత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Gujarat High Court
అహ్మదాబాద్: అత్యాచార బాధితురాలైన ఓ మహిళ గుజరాత్ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సోలా సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సందీప్ అంచాల్‌కు సిటీ సెషన్ కోర్టులో బెయిల్ రావడంతో ఆమె దానిని హైకోర్టులో సవాల్ చేసింది.

అయితే హైకోర్టులో విచారణ సమయానికి ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు హాజరు కాలేదు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఆశిష్ దేశాయ్ కేసు విచారణను వాయిదా వేశారు. ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ యువతి కోర్టు ఆవరణలో ఓ గదిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని పోలీసులు ప్రశ్నించారు. ఢిల్లీ యువతికి పట్టిన గతే నీకు పడుతుందంటూ నిందితుడు తనను భయపెడుతున్నాడని బాధిత యువతి పోలీసులకు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఆమె పోలీసులకు చూపించింది.

కాగా, గతేడాది డిసెంబరులో ఓ యువతి ఢిల్లీలో బస్సులోనే అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచారం చేసిన నిందితులు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే.

English summary
A rape victim attempted suicide in the courtroom of Gujarat high court on Tuesday by consuming pesticide. She was rushed to the Sola Civil Hospital, where her condition is said to be critical. This is the second such incident since January when a rape victim attempted suicide in a courtroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X