వృద్ధిరేటు కష్టమే, అయినా సాధిస్తాం: ప్రధాని మాట

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అగాధంలోకి వెళ్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ముందు కలలు సృష్టించి ఆ తర్వాత కోతలు విధించడం యుపిఎ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన అన్నారు. 2012 -13 బడ్జెట్లో ప్రణాళికా వ్యయంలో రూ.93 వేల కోట్లు కోత విధించారని ఆయన విమర్శించారు. దీనివల్ల సంక్షేమం, వ్యవసాయ రంగాలపై ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు.
ఎన్నికల దృష్ట్యా కేటాయింపులు అధికంగా చూపినా వెనక కోతలు విధించడం చిదంబర రహస్యమైనని ఆయన అన్నారు. తాజా బడ్జెట్లో 6.5 శాతం పెంపు నామమాత్రమేనని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా పన్నులు లేకున్నా, పరోక్షంగా పన్నులు భారీగా పెంచారని ఆయన అన్నారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపినా ద్రవ్యలోటు పూడ్చలేని అసమర్థత యుపిఎదేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఆర్థిక మంత్రి పి. చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉద్యోగులను నిరాశ పరిచిందని తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిధిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచాలన్న డిమాండ్ను పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications