ఉత్తమ వారసత్వం నగరంగా వరంగల్: చిరంజీవి

ఆ దిశగా ఆయన ముందడుగు వేశారు. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలు కేటాయించే ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన వరంగల్కు తాజాగా ఈ అపూర్వమైన గౌరవాన్ని అందించారు. ఈ గుర్తింపుతో ఓరుగల్లులోని కాకతీయుల కోట, వేయిస్తంభాల దేవాలయం, భద్రకాళి ఆలయం తదితర ప్రాంతాలకు మంచి రాణింపు వస్తుంది. పెద్దఎత్తున విడుదలయ్యే నిధులతో పర్యాటకులను మరింతగా ఆకర్షించేలా కొత్త హంగులు సమకూర్చడానికి వీలవుతుంది. వీటితోపాటు నగరంలో సరికొత్త పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, ప్రత్యేకంగా అందించే నిధులతో అభివృద్ధిపరుస్తారు.
ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా జిల్లా కేంద్రానికి అందుతాయని అధికారులు తెలిపారు. వరంగల్ను ఉత్తమ వారసత్వ నగరంగా ప్రకటించడంపై ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఢిల్లీలోని తన నివాసంలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి, రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ జిల్లా మంత్రులు కూడా ఈ గుర్తింపు పట్ల సంతోషం వెలిబుచ్చారు. రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చిరంజీవికి ఫోన్ చేసి మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
-
హైదరాబాద్ TO కొచ్చి.. తక్కువ ధరకే అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ.. -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications