21న సడక్ బంద్కు తెలంగాణ జెఎసి పిలుపు

శనివారం ఉదయం తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశమైంది. సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే పాలమూరు జిల్లాలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సడక్ బంద్పై చర్చిస్తామని తెలిపారు. సడక్ బంద్ నేపథ్యంలో తెలంగాణవాదులని అరెస్టు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. బైండోవర్లకు, అరెస్టులకు జేఏసీ భయపడదని ఆయన చెప్పారు.
తెలంగాణ కోరుకునే ప్రతి ఒక్కరూ తమతో కలిసిరావాలని ప్రొ. కోదండరాం పిలుపునిచ్చారు. లేని పక్షంలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఫిబ్రవరి 24న చేపట్టాల్సిన సడక్ బంద్ను జేఏసీ వాయిదా వేసిన విషయం తెలిసిందే.
శనివారం జరిగిన తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ సమావేశానికి బిజెపి నేతలు హాజరు కాలేదు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ మండలి సమావేశానికి వెళ్లారు.












Click it and Unblock the Notifications