తెరాస పాత్ర కూడా ఉంది: బాబ్లీపై టిడిపి వ్యాఖ్య
బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలుగుదేశం పా్రటీ నేతలు స్పందిస్తూ కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. ఏం గడ్డిపీకడానికి బాబ్లీపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలుగుదేశం పార్టీ నేత తుమ్మల నాగేశ్వర రావు ప్రశ్నించారు. ఇన్ని రోజులు ఎందుకు, ఎవరి కోసం వాదించారని ఆయన దుయ్యబట్టారు. ఈ పాపంలో తెరాసకు కూడా భాగం ఉందని తుమ్మల ఆరోపించారు.
మహారాష్ట్ర నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా వివిధ పార్టీల నేతులు బాబ్లీ వల్ల నష్టం లేదనడం అవగాహన లేకపోవడమేనని ఎర్రబెల్లి విమర్శించారు. గోదావరి నదిపై చెక్డ్యాం పేరుతో మహారాష్ట్ర అక్రమంగా 13 అక్రమ జలాశయాలు నిర్మించిందని ఆయన ఆరోపించారు.
రెండు టీఎంసీల తాగు నీటి కోసం డ్యాం కట్టుకుంటున్నామని చెబుతూ బాబ్లీ ప్రాజెక్టు పేరిట వందల టీఎంసీల నీటిని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపిచారు. బాబ్లీనీ కేంద్రప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు కావల్సిన తాగునీటిని కేంద్రమే ఇవ్వాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.