జగన్‌ను ఎదుర్కునే దమ్ము కిరణ్‌ రెడ్డికి లేదు: విహెచ్

V Hanumanth Rao
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో తెలుగుదేశం నాయకులను, వైయస్ జగన్, షర్మిల, వారి తల్లి విజయలక్ష్మిని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేకుండా పోయిందని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. కర్ణాటకలో పిసిసి, సీఎల్పీ నేతలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సమష్టి బాధ్యతలను పంచుకుని ఏ ఎన్నిక జరిగినా కలసికట్టుగా వ్యూహ రచన చేసి, పార్టీని గెలిపించేందుకు కృషి చేస్తున్నారని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి సర్వం తానే అయినట్లు వ్యవహరిస్తున్నారంటూ శుక్రవారం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ను కలిసి విహెచ్ విన్నవించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వికేంద్రీకరణ లేకుండా పోయాయని, ముఖ్యమంత్రి ఎప్పుడు ఏమి ప్రకటిస్తారో, పిసిసి అధ్యక్షుడు ఏ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో తెలియకుండా పోయాయని ఆయన అన్నారు. ఎన్నికలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి లేదా పిసిసి అధ్యక్షుడు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఏ సీనియర్ నాయకుడినీ వారు సంప్రదించటం లేదని తెలిపారు. మొక్కుబడిగా సమావేశాలు ఏర్పాటు చేసి ఊరుకుంటున్నారని వీహెచ్ చెప్పారు.

వలస వెళ్లేవారిని ఆపేందుకు ఏ నాయకుడూ ప్రయత్నించటం లేదన్నారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించాలన్న అభిప్రాయమే ముఖ్యమంత్రి లేనట్లు కనబడుతోందని చెప్పారు. రాష్ట్రంలో పార్లమెంటు సభ్యులకు విలువ ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

ఇటీవల ప్రధానమంత్రి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తనను, ఇతర పార్టీ సీనియర్ నేతలను పోలీసులతో వెనక్కు నెట్టివేయించారని హనుమంతరావు విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+