మోస్ట్ పాపులర్ సిఎం: మోడీపై రాజ్నాథ్ ప్రశంసలు

బిజెపి జాతీయ మండలి సమావేశంలో ఆయన శుక్రవారం ఆయన మాట్లాడారు. ఒకే నాయకత్వంపై బిజెపి మూడు సార్లు పార్టీ విజయం సాధించడం అంతకు ముందు ఎన్నడూ జరగలేదని అన్నారు. నాయకులు, కార్యకర్తలు తలపెట్టిన సన్మానాన్ని స్వీకరించడానికి మోడీ హర్షధ్వానాల మధ్య వేదికపైకి చేరుకున్నారు. కేవలం మాటలతో మోడీని వేదికమీదికి అహ్వానించడం సరిపోదని, పెద్ద యెత్తున హర్షధ్వానాలు అవసరమని, నిలబడి అభినందించాలని రాజ్నాథ్ సింగ్ అన్నారు.
ప్రభుత్వాలను విజయవంతంగా నడుపుతున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ను కూడా ఆయన అభినందించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ను, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీని కూడా ఆయన కొనియాడారు.
తన సమీప భూత పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి ఆయన అండగా నిలిచారు. గడ్కరీపై ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం పలు రంగాల్లో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉగ్రవాదాన్ని అదుపు చేయడంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విఫలమయ్యారని ఆయన అన్నారు. ఆర్థిక రంగంలో గాడిలో పెట్టడంలో కూడా యుపిఎ విఫలమైందని ఆయన అన్నారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్












Click it and Unblock the Notifications