ఎన్నికలకే, మంత్రిగా కెసిఆర్: కవిత వర్సెస్ తుమ్మల
టిడిపి వ్యాఖ్యలపై తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత స్పందించారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో నష్టం జరిగితే తప్పకుండా ఉద్యమిస్తామన్నారు. ఎన్నికల కోసమే బాబ్లీ అంశాన్ని టిడిపి ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పై టిడిపి నేతలు ఎందుకు పెదవి విప్పడం లేదన్నారు. పోలవరంకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఆమె చెప్పారు.
పోలవరం టెండర్లపై పిటిషన్ వాయిదా
పోలవరం టెండర్లు ట్రాన్స్ట్రాయ్ సంస్థకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిపై కోర్టు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత విచారణ చేపట్టింది. దీనిపై ఉన్నతస్థాయి కమిటీ నివేదికను సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసును ఈ నెల 11వ తేదికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ను సోమా కంపెనీ వేసింది.
Comments
kavitha tummala nageswara rao babli project k chandrasekhar rao hyderabad కవిత తుమ్మల నాగేశ్వర రావు బాబ్లీ ప్రాజెక్టు కె చంద్రశేఖర రావు హైదరాబాద్
English summary
Telugudesam Party senior leader Tummala Nageswara Rao has blamed TRS chief K Chandrasekhar Rao on Babli issue.