టాప్20 వుమెన్: సోనియా, సైనానెహ్వాల్, ఐశ్వర్యరాయ్
ఐసిఐసిఐ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ సిఈవో చందాకొచ్చార్, పెప్సీకో సిఈవో ఇంద్రనూయిలు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ రోజు(శుక్రవారం) మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై సర్వే చేశారు. టాప్ 20 మహిళలు-2012 పేరుతో ఈ అధ్యయనం చేశారు. గురువారం వివరాలు వెల్లడించారు.
ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, కొచ్చిన్, బెంగళూరు, హైదరాబాద్, ఇండోర్, పాట్నా, పూణే, చండీగఢ్, డెహ్రాడూన్ తదితర నగరాలలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ అధ్యయనం చేశారు. కార్పోరేట్ స్థాయి ఉద్యోగులను సర్వే కోసం ఎంపిక చేసుకున్నారు. వీరిలో అత్యధికులు ఇరవై నుండి ముప్పయ్యేళ్ల సంవత్సరాలు మధ్య వారే.
టాప్ ట్వంటీలో వరుసగా.. సోనియా గాంధీ, చందాకొచ్చార్, ఇంద్రనూయి, కిరణ్ మంజుదార్ షా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శిఖాశర్మ, విద్యాబాలన్, మేరీకోం, సైనా నెహ్వాల్, కిరణ్ బేడీ, నైనాలాల్, కిద్వాయ్, స్వాతి పిరామల్, షబానా అజ్మి, ఏక్తాకపూర్, జోయా అక్తర్, సుష్మా స్వరాజ్, జయలలిత జయరామ్, మమతా బెనర్జీ, మీరా కుమార్, దింపుల్ యాదవ్లు వరుసగా ఒకటి నుండి ఇరవై స్థానాల వరకు నిలిచారు.