ఢిల్లీలో హైదరాబాద్ యువతిపై సహోద్యోగుల కీచకపర్వం
ఇంటివద్ద దిగబెడతానని అనటంతో తన సహోద్యోగి కారులో ఆమె కూర్చుంది. అదే కారులో మరో ఇంకో ఉద్యోగి కూర్చున్నాడు. అయితే, వీరిద్దరు అమెను ఇంటి వద్ద దిగబెట్టకుండా గుర్గావ్ రోడ్లపై తిప్పుతూ యువతిపై కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను రోడ్డు పైనే వదిలేసి వెళ్లిపోయారు. నిందితులిద్దరి పైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసును నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
రేప్ బిల్లుపై భిన్నాభిప్రాయాలు
మరోవైపు నేర నిరోధక చట్టం సవరణ బిల్లుపై పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖల మధ్య భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతల నేపథ్యంలో ఈ బిల్లుపై మంత్రివర్గ సమావేశంలో చర్చ వాయిదా పడింది. ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచార ఘటన నేపథ్యంలో ఫిబ్రవరి 3న మహిళలపై అత్యాచార నిరోధక ఆర్డినెన్సును జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో పూర్తి స్థాయిలో నేర నిరోధక చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ బిల్లు ముసాయిదాపై గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో చర్చించాల్సి ఉంది. అయితే.. నేరస్థుల మైనారిటీ వయస్సును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. అత్యాచారం అనే పదాన్ని ఉపయోగించడం కంటే లైంగిక దాడి అంటే స్త్రీ, పురుషులు అందరికీ వర్తిస్తుందని సవరణలను ప్రతిపాదించింది. కానీ, ఈ సవరణలకు న్యాయ శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ బిల్లు ముసాయిదాపై మరింత స్పష్టత అవసరమని భావించిన కేంద్ర హోంశాఖ చర్చను వాయిదా వేసింది.