వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫింగర్ మార్క్స్ చూశా, చంపేశారు: రాంసింగ్ సోదరుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ram Singh
న్యూఢిల్లీ: తన సోదరుడి దేహంపై గాయం మచ్చలు ఉన్నాయని, అదే విధంగా గొంతుపై వేళ్ల గుర్తులు ఉన్నాయని, తన సోదరుడిని చంపేశారని ఢిల్లీ సామూహిక అత్యాచార మృతురాలి కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ సోదరుడు ఆరోపించాడు. రాంసింగ్ ఉరి వల్లనే మరణించాడని పోస్టు మార్టం నివేదికలో తేలినట్లు పోలీసులు వర్గాలు చెప్పిన విషయం తెలిసిందే.

రాంసింగ్ మృతదేహాన్ని తీసుకోవడానికి అతని సోదరుడు ఎయిమ్స్‌కు వచ్చాడు. గాయం మచ్చలను గుర్తించడానికి వారు ఇష్టపడడం లేదని అతను అన్నాడు. రాంసింగ్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. రాంసింగ్ మృతదేహానికి ఎయిమ్స్‌లో పోస్టుమార్టం జరిగింది. పోస్టుమార్టం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ముగిసింది.

రాంసింగ్ తీహార్ జైలులోని అతని సెల్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉరి వేసుకుని రాంసింగ్ మరణించినట్లు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం రాంసింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్‌కు తరలించారు. సకాలంలో ఢిల్లీ పోలీసులు తగిన పత్రాలను అందజేయకపోవడం వల్ల సోమవారం పోస్టుమార్టం నిర్వహించలేకపోయారు.

రాంసింగ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లోని కరౌలీకి తీసుకుని వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రాంసింగ్ మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో బస్సు డ్రైవర్ రాంసింగ్ ప్రధాన నిందితుడు.

English summary
Ram Singh's brother, who came to AIIMS to receive the body, alleged that he was murdered and that he saw injury marks on his body and finger marks on his neck.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X