ఫింగర్ మార్క్స్ చూశా, చంపేశారు: రాంసింగ్ సోదరుడు
రాంసింగ్ మృతదేహాన్ని తీసుకోవడానికి అతని సోదరుడు ఎయిమ్స్కు వచ్చాడు. గాయం మచ్చలను గుర్తించడానికి వారు ఇష్టపడడం లేదని అతను అన్నాడు. రాంసింగ్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు మంగళవారం అప్పగించారు. రాంసింగ్ మృతదేహానికి ఎయిమ్స్లో పోస్టుమార్టం జరిగింది. పోస్టుమార్టం ఉదయం 11 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ముగిసింది.
రాంసింగ్ తీహార్ జైలులోని అతని సెల్లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉరి వేసుకుని రాంసింగ్ మరణించినట్లు చెబుతున్నారు. సోమవారం సాయంత్రం రాంసింగ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్కు తరలించారు. సకాలంలో ఢిల్లీ పోలీసులు తగిన పత్రాలను అందజేయకపోవడం వల్ల సోమవారం పోస్టుమార్టం నిర్వహించలేకపోయారు.
రాంసింగ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు రాజస్థాన్లోని కరౌలీకి తీసుకుని వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రాంసింగ్ మృతిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సామూహిక అత్యాచారం కేసులో బస్సు డ్రైవర్ రాంసింగ్ ప్రధాన నిందితుడు.