అడ్డుకుంటాం: ఈటెల, నా చేతుల్లో లేదు: కిరణ్ రెడ్డి

Etela Rajender-Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణపై తీర్మానం చేసేంత వరకు శానససభా సమావేశాలను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభా పక్ష నేత ఈటెల రాజేందర్ చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల కార్యక్రమాలను ఖరారు చేయడానికి బుధవారం జరిగిన బిఎసి సమావేశంలో ఈటెల రాజేందర్ ఆ డిమాండ్ పెట్టారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. అందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరాకరించారు.

తెలంగాణ అంశం తమ చేతుల్లో లేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని, అందువల్ల తీర్మానం పెట్టలేమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయం తీసుకుంటే తీర్మానం పెడతామని ఆయన అన్నారు. కేంద్రం తీసుకుని నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు. శానససభలో చర్చించేందుకు తెలుగుదేశం 18 అంశాలను సమావేశంలో పెట్టింది.

కాగా, ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు ఇతర పార్టీల సంతకాల సేకరణలో తెరాస పడింది. సిపిఐ సభ్యులు నలుగురు, బిజెపి సభ్యులు ముగ్గురు తెరాస ఇవ్వబోయే నోటీసుపై సంతకాలు చేశారు. సంతకం చేయడానికి సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి నిరాకరించారు. అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇస్తాం గానీ నోటీసుపై సంతకం చేయబోమని ఆయన చెప్పారు.

పార్టీని ధిక్కరిస్తే ఉపేక్షించేది లేదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ తిరుగుబాటు శానససభ్యులను హెచ్చరించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై అనర్హత వేటు తప్పదని తెలిపారు. చర్యలు తీసుకునే లోపే కొందరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకుంటారని భావిస్తున్నట్లు గండ్ర చెప్పారు.

శాసనసభ సమావేశాలు సజావుగా సాగడానికి తెరాస సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం కృషి చేస్తోందని ఆయన అన్నారు. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరు విచారకరమని ఆయన అన్నారు. కాంగ్రెసును వీడినవారు మనసు మార్చుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+