పొత్తులతో నష్టపోయాం, ఒంటరి పోటీయే: చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాల సమీక్షా సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కొంత మంది కార్యకర్తలు తమ ప్రాణాలను కూడా త్యాగం చేశారని ఆయన అన్నారు. కొద్ది మంది నాయకులు పార్టీని విడిచి వెళ్లారే గానీ కార్యకర్తలు పార్టీలోనే కొనసాగుతున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కార్యకర్తలపై గురుతర బాధ్యత ఉందని ఆయన అన్నారు.
ప్రజలను పార్టీకి అనుకూల ఓటర్లుగా మార్చే బాధ్యత కార్యకర్తలపై ఉందని చంద్రబాబు చెప్పారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి రసాభాస చేశారని ఆయన విమర్శించారు.
రెడ్డీస్ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ అంజిరెడ్డి మృతికి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. అంజిరెడ్డి శుక్రవారం కన్నుమూసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications