చాటింగ్ ప్రేమ: నలుగురితో అతను పెళ్లి, ఒకామె ఫిర్యాదు
ఆమె ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి - పూణెకు చెందిన సునీతా కుమారి సింగ్ (35)ను అల్వాల్కు చెందిన అనిల్కుమార్ ఇంటర్నెట్ చాటింగ్తో పరిచయమై 2009 నవంబర్ 5న సికింద్రాబాద్లోని మినర్వా హోటల్లో పెళ్లి చేసుకున్నారు. వరకట్నం కింద 15తులా ల బంగారం, రూ.2 లక్షల నగదును అనిల్కుమార్కు ఇచ్చారు. సునీత నగరంలోని ఓ కార్పొరేట్ పాఠశాలలో హిందీ టీచర్గా పని చేస్తున్నారు. అనిల్కుమార్ వృత్తిరీత్యా హైకోర్టు అడ్వొకేట్తోపాటు ఒడాఫోన్, నెస్లీ కంపెనీ డీలర్గానూ పనిచేస్తున్నారు.
కొద్ది రో జులపాటు సవ్యంగా కాపురం చేసిన అనిల్కుమార్ ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడని, అయితే అంతకుముందే 1993లో భవానితో, 2002లో ఇందిర అనే మహిళతో వివాహం జరిగిందని, వారితో కాకుం డా జయలక్ష్మి అనే మరో మహిళతో కూడా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
2012సెప్టెంబర్ 3న తన తమ్ముడు అమెరికాలో గ్రీన్కార్డు హోల్డరని, తనను రమ్మన్నాడని చెప్పి ఇంటినుంచి వెళ్లిన అనిల్కుమార్ ఇప్పటికీ రాలేదని ఆమె చెప్పింది. తనను ఇంట్లోనుంచి వెళ్లగొట్టడానికి మామ జానకిరాం, అత్త సులోచన, ఆడపడుచు అనిత తీవ్రంగా వేధించారని తెలిపింది. దీంతో సీఐడీ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు అల్వాల్కు వచ్చి మామ జానకిరాం, అత్త సులోచన, ఆడపడుచును అరెస్టుచేసి ఎల్బినగర్ కోర్టులో హాజరుపరిచారు. వారిపై సెక్షన్ 498ఎ, సెక్షన్ 417లను నమోదు చేశారు.