శ్రీవారి ఆశీస్సుల కోసం సుశీల్ కుమార్ షిండే...(పిక్చర్స్)
చిత్తూరు/ఏలూరు: కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో షిండే స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మహాద్వారం వద్ద షిండేకు టిటిడి అధ్యక్షుడు కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం రంగ నాయకుల మండపంలో అర్చకుల వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం తీర్ఫప్రసాదాలు అందించారు. శనివారం తిరుమలకు వచ్చిన షిండే శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం షిండే పశ్చిమ గోదావరి జిల్లాలోని మోడీ గ్రామానికి వెళ్లారు. అక్కడ హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడారు.
జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంకు సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. మొదటి దశలో రూ.15వందల కోట్లతో ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణం, ప్రజలను అప్రమత్తం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండో దశలోని ఎపికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మోడిలోని బ్రిడ్జిని ఏడాదిలోపు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. స్థానిక సమస్య అవగాహన ఉందని, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. భీమవరం-దొంగపిండి మధ్య రూ.10 కోట్లతో మరో బ్రిడ్జి నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖలు కలిసి కట్టుగా విపత్తులను ఎదుర్కోవాలని సూచించారు.
షిండేకు శేసవస్త్రంతో సత్కారం
శ్రీవారి పటాన్ని షిండేకు ఇస్తున్న ఈవో, అధ్యక్షుడు
పుణ్యజలం తలపై...
షిండేతో కనుమూరి తదితరులు
షిండేకు పూజారి ఆశీర్వాదం
ప్రసాదం స్వీకరిస్తున్న కేంద్ర హోంమంత్రి
ఆలయ ప్రాంగణంలో
ధ్వజ స్తంభానికి మొక్కుతున్న కేంద్రమంత్రి
షిండే సాష్టాంగ నమస్కారం
హారతి తీసుకుంటున్న షిండే
శ్రీవారి సేవలో..
అమ్మవారి సేవలో..