కిరణ్ రెడ్డి సీల్డ్ కవర్ సిఎం, ఆ దమ్ముందా?: షర్మిల
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో రాష్ట్రం అస్తవ్యస్త మైందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్నారని, వీరి సమస్యలు తీరాలంటే వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైయస్ హయాంలో రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు కొనసాగించారన్నారు. నేడు కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి 3 గంటలు విద్యుత్ సరఫరా కూడా కాని పరిస్థితి నెలకుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కొనసాగడానికి వీలులేదని చంద్రబాబు ప్రకటిస్తూనే మరో పక్క అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంతో పాటు రూ.32 వేల కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేసిందని ఆరోపించారు.
వైయస్ చనిపోయిన మూడేళ్లలో గ్యాస్, కరెంట్ ధరలను ప్రభుత్వం మూడు రెట్లు పెంచిందని ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతిపక్షాలు అన్ని ఒకటై అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ కలిసి రాకపోవడం దారుణం అని ఆమె మండిపడ్డారు.