అసెంబ్లీ ప్రాంగణంలో పోలీస్ను చితకబాదిన ఎమ్మెల్యేలు
ఈ రోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం అనంతరం ఎమ్మెల్యే ఠాకూర్ సదరు పోలీసు అధికారి పైన ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. తన వాహనాన్ని బాంద్రా-వోర్లీ ప్రాంతంలో అధికారి నిలిపివేసి బిస్ బిహేవ్ చేశారని ఎమ్మెల్యే ఆరోపిస్తూ ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం... ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. అతను అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసు అధికారి వాహనాన్ని ఆపి మిస్ బిహేవ్ చేశాడు.
తన పట్ల మిస్ బిహేవ్ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. అదే సమయంలో అధికారి సూర్యవంశి విజిటర్స్ గాలరీలో కూర్చున్నారు. అతనిని ఎమ్మెల్యే గుర్తించారు. దీంతో ఆయనకు తోడు పలువురు ఎమ్మెల్యేలు సూర్యవంశి వద్దకు దూసుకు వెళ్లి అతనిని కొట్టారు.
వెంటనే తేరుకున్న విధాన సభ సెక్యూరిటీ సిబ్బంది సూర్యవంశిని బయటకు తీసుకు వెళ్లారు. ఓ గదిలోకి తీసుకు వెళ్లి డాక్టర్లతో చెక్ చేయించారు. హోంమంత్రి ఆర్ఆర్ పాటిల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఏక్నాథ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పోలీసు అధికారిని పరామర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని స్పీకర్ చెప్పారు.