మే 5న కర్నాటకలో ఎన్నికలు: ఎపిలో వేటుపై సస్పెన్స్

ఏప్రిల్ 18న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఏప్రిల్ 20వ తేదిన నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. మే 5వ తేదిన శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. మే 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కర్నాటకలో 224 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని, 4.18 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం తెలిపింది. ఈవిఎంల ద్వారానే ఓటింగ్ నిర్వహిస్తామని, 98.6 శాతం ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు తెలిపింది. మీడియాలో చెల్లింపు వార్తలపై నిఘా పెట్టామని, ఎన్నికలకు 50,446 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
మధ్యంతరానికి సిద్ధం కావాలని రాహుల్ పిలుపు
మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆయన ఎంపీలకు మధ్యంతర హెచ్చరికలు జారీ చేశారు. డిఎంకె యూపిఏకు మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్రం ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధం కావాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. నియోజకవర్గాల్లో ఎక్కువ కాలం గడపాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయన రెండు మూడు రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో భేటీ అయ్యారు. ఎస్పీ, బిఎస్పీ బయటి నుండి మద్దతిస్తున్నప్పటికీ రాహుల్ గాంధీ వారిపై నమ్మకంగా లేనట్లుగానే కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో వేటుపై వేడి.. ఉప ఎన్నికలపై సస్పెన్స్
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సమయంలో విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గ తమ పార్టీ ఎమ్మెల్యేల పైన కాంగ్రెసు పార్టీ వేటు వేసే విషయంపై చర్చిస్తోంది. ఇప్పటికే పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ గీత దాటిన ఎమ్మెల్యేలపై వేటు వేసే విషయమై పార్టీ అధిష్టానంతో చర్చిస్తున్నారు. గీత దాటిన వారిపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్తారా? మరో రెండు నెలలు ఆగి ఉప ఎన్నికలు రాకుండా వారిపై చర్యలు తీసుకుంటారా? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications