నిర్భయ లా ప్రకారం దేశంలో సంగారెడ్డి కోర్టు తొలి తీర్పు

నిందితుడు అత్యాచారం కేసులో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన సంగారెడ్డి కోర్టు శుక్రవారం నిందితుడు యాదవ్కు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. నిందితుడి పైన ఐడిఏ బొల్లారం పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. నిందితుడి స్వస్థలం బీహార్. ఇతని వయస్సు ఇరవై రెండు.
ఇటీవల నిర్భయ చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. మొదట ప్రవేశ పెట్టిన చట్టానికి ప్రతిపక్షాలు కొన్ని సవరణలు సూచించాయి. ప్రతిపక్షాల సూచనల మేరకు ఈ చట్టాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం అనంతరం ఇటీవలే మరోసారి సభలో నిర్భయ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఈ చట్టానికి సభ ఆమోదం తెలిపింది. చట్టం ఆమోదం పొందిన తర్వాత సంగారెడ్డి కోర్టు నిర్భయ చట్టం ఆధారంగా దేశంలోనే తొలిసారి తీర్పు చెప్పింది.
కాగా, గతేడాది డిసెంబర్ 16వ తేదిన నిర్భయపై కదులుతున్న బస్సులోనే సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నిర్భయపై అత్యాచారాన్ని ఖండిస్తూ రోడ్డెక్కారు. ఆమెకు ప్రభుత్వమే చికిత్స అందించింది. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ కూడా తీసుకు వెళ్లింది. నిర్భయ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె మృతి తర్వాత ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకు వచ్చింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications