కూతురు పెళ్లి, ఈడి విచారణ: సాయిరెడ్డికి ఊరట

Vijaya Sai Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో నిందితుడైన జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి బెయిల్‌పై ఆంక్షలను కోర్టు సడలించింది. ఆయన కూతురు వివాహం సందర్భంగా విజయసాయి పెట్టుకున్న బెయిల్‌పై కోర్టు స్పందించింది. హైదరాబాదు విడిచి వెళ్లడానికి ఆయనకు కోర్టు నుంచి అనుమతి లభించింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) విచారణకు హాజరు కావడానికి వీలుగా కూడా తనపై పెట్టిన ఆంక్షలను సడలించాలని విజయసాయి రెడ్డి కోరారు. ఈనెల 27 నుంచి జూన్ 10 వరకు ఆయన బెయిల్‌పై ఆంక్షలను సడలిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డికి తద్వారా ఊరట లభించింది. జగన్ ఆస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ముందు హాజరు కావడానికి, తన కూతురు పెళ్లికి హైదరాబాద్ విడిచి వెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ విజయసాయిరెడ్డి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

విజయసాయి రెడ్డికి పెట్టిన ఆంక్షలను సడలించడానికి సిబిఐ అభ్యంతరం చెప్పలేదు. ఈ స్థితిలో తన నిర్ణయాన్ని కోర్టు శుక్రవారంనాడు సోమవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు సోమవారం కోర్టు నిర్ణయం వెలువడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+