ఎన్నారై భార్య: శాడిస్టు మొగుడు, పారిపోయాడు

గృహ హింస చట్టంతో పాటు దాడి కేసు కూడా నమోదు కావడంతో పోలీసులు వంశీకృష్ణ అరెస్ట్కు రెడ్కార్నర్ నోటీసు జారీ చేశారు. త్వరలోనే ఆయన పాస్పోర్ట్ను సీజ్ చేసి, అరెస్ట్ చేసి ఇండియాకు తీసుకువచ్చే అవకాశం ఉంది. తమ కూతురు జీవితాన్ని నాశనం చేసి, ఆర్థికంగానూ ఆమెను దెబ్బతీయడానికి కుట్ర పన్నిన వంశీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తండ్రి కోరుతున్నారు. పోలీసులు అక్కినేని వంశీకృష్ణపై కేసు నమోదు చేసి, రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
వంశీకృష్ణ సొంత ఊరు కృష్ణా జిల్లా బొడ్డపాడు. విజయవాడకు చెందిన ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె 2000 సంవత్సరంలో అమెరికా వెళ్లి ఎంఎస్ చేశారు. అప్పటికే అమెరికాలో ఉన్న వంశీకృష్ణకు 2004లో ఆ వ్యాపారవేత్త తన కూతురినిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 10 లక్షల నగదు, బంగారం ముట్టచెప్పారు. పెళ్లయ్యేనాటికి వంశీకృష్ణ షికాగోలో పీహెచ్డీ చేస్తున్నాడు. ఆయన భార్య కాలిఫోర్నియాలో ఉండేవారు.
మూడేళ్లపాటు అలా ఉంటూ నెలకు ఒకటి రెండుసార్లు కలుసుకునేవారు. 2006లో ఆమె గూగుల్లో చేరారు. తర్వాత భర్తకు కూడా అక్కడే ఉద్యోగం ఇప్పించారు. 2007 నుంచి ఇద్దరూ ఒకే చోట కలిసి ఉండటం ప్రారంభించారు. అప్పుడు వంశీకృష్ణ అసలు స్వరూపం బయటపడింది. భార్యను మానసికంగా చిత్రహింసలు పెట్టేవాడు. వారాంతంలో బయటకు వెళ్లే పరిస్థితి కూడా లేకుండా హింసించడం మొదలుపెట్టాడు. ఆమె తరఫు బంధువులను దూరంగా పెట్టేవాడు. ఈ బాధలు భరించలేక 2011 జూన్లో భర్త నుంచి విడిపోయారు.
2012 మార్చిలో వంశీకృష్ణ భార్యను బతిమాలి తిరిగి కాపురానికి తెచ్చుకున్నాడు. తర్వాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇద్దరూ గత ఏడాది నవంబర్లో ఇండియా వచ్చారు. ఇంటికి వచ్చాక భర్త వేధింపులను ఆమె తల్లిదండ్రుల వద్ద ఏకరవు పెట్టుకుని అతడితో కాపురం చేయలేనన్నారు. దీంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు దీనిపై మాట్లాడేందుకు డిసెంబర్ 2న గుంటూరు జిల్లా మంగళగిరిలోని వంశీకృష్ణ ఇంటికి వెళ్లాడు. తమ కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆయన తల్లిదండ్రులకు వివరిస్తుండగానే వంశీకృష్ణ రెచ్చిపోయాడు. మామపై దాడి చేసి గాయపరిచాడు.
దీనిపై ఆయన మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైతే అమెరికా వెళ్లడం కుదరదని డిసెంబర్ 3న హుటాహుటిన విమానం ఎక్కేశాడు. మానసిక రోగాన్ని దాచి ఉంచి పెళ్లి చేసుకోవడమేకాక వేధింపులకు గురి చేస్తున్న భర్తపై బాధితురాలు డిసెంబర్ 12న హైదరాబాద్లోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఫిర్యాదు చేశారు. అప్పటికే అతనిపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసునమోదైంది. వంశీకృష్ణ, ఆయన తల్లిదండ్రులు అక్కినేని మాధవరావు, ధనలక్ష్మిలపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో మాధవరావు, ధనలక్ష్మిలను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications