అమెరికాలో ఇండియన్ అమెరికన్ విద్యార్థి మిస్
సునీల్ త్రిపాఠీకి సంబంధించి ఏ విధమైన సమాచారం లభించలేదని లీడ ఇన్విస్టిగేటర్ డిటెక్టివ్ మార్కో సాకో చెప్పారు. త్రిపాఠీ సెల్ఫోన్, క్రెడిట్ కార్డు, ఐడి, ఇతర వ్యక్తిగత వస్తువులు గదిలోనే ఉన్నాయి. దర్యాప్తుపై మాట్లాడడానికి ఎఫ్బిఐ నిరాకరిస్తోంది. స్థానిక పోలీసులకు తాము సహకరిస్తున్నామని అంటోంది.
త్రిపాఠీ అంజెల్ స్ట్రీట్ నివాసం నుంచి ఈ నెల 16వ తేదీ ఉదయం తప్పిపోయాడని మిత్రులు ఫేస్బుక్లో చెప్పారు. నిరుడు బ్రౌన్ యూనివర్శిటీ నుంచి గైర్హాజరు సెలవు తీసుకున్నప్పటి నుంచి సునీల్ మానసిక ఒత్తిడికి గురైనట్లు కనిపంచాడని మిత్రులు అంటున్నారు.
అతను సురక్షితంగా ఇంటికి తిరిగి రావాలని తాము కోరుకుంటున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. విశ్వవిద్యాలయం కూడా గాలింపునకు తగిన సహకారం అందిస్తోంది. ఆత్మహత్య చేసుకుంటాననే సూచనను ఇచ్చి లేఖను చూసి కుటుంబ సభ్యులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.