జగన్ 'పాలసీ'లపై మంత్రుల ఎదురుదాడి, యాత్రపై డికె
సోమవారం విద్యుత్ విషయంలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ సంక్షేమ పథకాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన ఖాతాలో వేసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచనల మేరకే నాడు వైయస్ పథకాలను ప్రవేశ పెట్టారని, పథకాలు కాంగ్రెసు పార్టీవే కానీ ఏ ఒక్కరికి చెందినవి కాదని ఆయన అన్నారు.
వైయస్ కాంగ్రెసు నేత అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను తమ పథకాలుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పుకోవడంతోనే ఆ పార్టీ తీరు ఏమిటో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విద్యుత్ సంక్షోభానికి వైయస్ రాజశేఖర రెడ్డి, కాంగ్రెసు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. టిడిపి విమర్శలను అధికార పార్టీ తిప్పికొట్టినప్పటికీ వైయస్ పైన ఆ పార్టీ చేసిన విమర్శలకు అంత స్థాయిలో స్పందించలేదనే చెప్పవచ్చు.
అయితే, వైయస్ తమ నేతగా చెప్పుకునేందుకు కొంత వెనుకేసుకొచ్చినట్లు కనిపించినా పూర్తిస్థాయిలో కనిపించలేదు. వైయస్ ఇమేజ్ను జగన్ క్యాష్ చేసుకుంటుండడమే కారణం. మంత్రులు కొండ్రు మురళి, శైలజానాథ్లు మాట్లాడుతూ... వైయస్ తన హయాంలోని విద్యుత్ రుణ మాఫీని తప్పు పట్టారు. పార్టీకి చెందిన ఎస్సీ ఎమ్మెల్యేలం అందరం వెళ్లి అడిగినా వైయస్ కేవలం యాభై శాతం మాత్రమే మాఫీ చేశారన్నారు. మంత్రి డికె అరుణ మాట్లాడుతూ... పాదయాత్రకు తానే ఆదర్శమని చెప్పారు. తన పాదయాత్రలో కాంగ్రెసు నేతలు పాల్గొన్నారని చెప్పారు.