ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో మావోయిస్టు అగ్రనేతలు
మావోయిస్టు అగ్రనేత గణపతి పైన 11 సెక్షన్ల కింద కేసును నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో అమెరికా నుండి ఆయుధాల దిగుమతి, ఆయుధాల తయారీ, ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరా తదితరాల కింద కేసును నమోదు చేశారు. మావోయిస్టులపై ఎన్ఐఏ కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి. బలిమెల ఘటన, ఆయుధాల రవాణా కేసుల్లో కేశవ రావును ఈ జాబితాలో చేర్చినట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.
మహిళా మావోయిస్టు లొంగుబాటు
ఓ మహిళా మావోయిస్టు లొంగిపోయారు. విశాఖపట్నం జిల్లా ఎస్పీ ఎదుట సదరు మావోయిస్టు మహిళ లొంగిపోయారు. బలిమెల ఘటనతో ప్రమేయమున్న సాధనపై రూ.4 లక్షల రివార్డ్ ఉంది. అనారోగ్య కారణాల వల్లనే సాధన లొంగిపోయినట్లుగా తెలుస్తోంది. ఆమెపై రివార్డ్ ఉందని పోలీసులు చెప్పారు.
పేలుళ్ల స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ
దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని ఎన్ఐఏ బృందం మరోసారి పరిశీలించింది. వెంకటాద్రి థియేటర్ వద్ద మొదటి పేలుడు ప్రాంతాన్ని తనిఖీ చేశారు. పేలుడు తీవ్రతకు ఎంతమేర దుకాణాలు దెబ్బతిన్నాయో పరిశీలించింది. ఓ దుకాణంలో లభించిన ఇనుప బోల్టులను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పదిమందితో కూడిన అధికారుల బృందం ఈ రోజు పర్యటించింది.