నరేంద్ర మోడీకి 'కీలక' పదవి: సెంట్రల్ బోర్డులో వెంకయ్య

Narendra Modi - Venkaiah Naidu
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ఉదయం కొత్త పార్లమెంటరీ బోర్డును ప్రకటించారు. ఇందులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పదవి లభించింది. మోడీకి కీలకమైన పదవిని ఇచ్చింది. పార్టీలో అత్యున్నత నిర్ణాయక కమిటీ అయిన పార్లమెంటరీ బోర్డులో ఆయనకు చోటు దక్కింది. పదకొండు మంది సభ్యుల ఈ కమిటీలో ఆరేళ్ల అనంతరం నరేంద్ర మోడీకి చోటు కల్పించారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇందులో చోటు లభించలేదు. పార్లమెంటు సభ్యుడు వరుణ్ గాంధీతో పాటు మోడీ సలహాదారుడు అమిత్ షా, మురళీధర రావులను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఉపాధ్యక్షులుగా స్మృతి ఇరానీ, ఉమా భారతిలను నియమించారు. మహిళా మోర్చా అధ్యక్షురాలుగా సరోజ్ పాండే ఎంపికయ్యారు. పార్లమెంటరీ సెంట్రల్ బోర్డులో వెంకయ్య నాయుడుకు చోటు లభించింది. కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మురళీధర రావు స్వంత జిల్లా కరీంనగర్. క్రమశిక్షణ కమిటీలో విశాఖకు చెందిన హరిబాబుకు చోటు దక్కింది.

మోడీ ప్రధానిగా సంకేతాలు

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్లమెంటరీ బోర్డులోకి తీసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ సంకేతాలిచ్చినట్లేనని భావిస్తున్నారు. అంతేకాకుండా మోడీ సలహాదారుడు అమిత్ షాకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అధికారికంగా ప్రకటించక పోయినా 2014లో బిజెపి ప్రధాని అభ్యర్థి మోడియేననే సంకేతాలు పరోక్షంగా ఇచ్చినట్లే అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+