వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుత్వాన్ని కించపర్చి అసెంబ్లీలోకా?: పరిపూర్ణానంద

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paripoornananda Swamy
హైదరాబాద్: హిందువులను, హిందుత్వాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఓ ప్రజాప్రతినిధి అసెంబ్లీలో ఉండటమా? అంటూ కాకినాడ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీని ఉద్దేశించి ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్లో విలేకరులతో మాట్లాడారు.

హిందువులను, హిందుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిన ఓ ప్రజాప్రతినిధి శాసనసభలో మళ్లీ ప్రవేశించినా ఏ ఒక్కరూ ఆయన చేసిన పనిని తప్పు పట్టకపోవడమేమిటని ఆయన అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రినే లక్ష్యంగా చేసుకొని ఎవరికీ భయపడబోమని ఆ ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు.

కళంకితులు అసెంబ్లీలోకి రాకుండా చట్టాలు చేయాలని కోరారు. ప్రభుత్వం మైనార్టీల పక్షాన నిలుస్తూ ఇతరులకు రక్షణ లేకుండా చేస్తోందని ఆరోపించారు. విదేశాల నుంచి ఎన్జీవోలకు ఏటా రూ.15వేల కోట్లు వస్తున్నాయని, వాటితో మతమార్పిడిలు చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

చైనాలో ఎన్నికల సమయంలోనే రాజకీయం జరుగుతుందని, అనంతరం అందరూ దేశం కోసం పాటుపడుతారని, మనవద్ద కూడా నాయకులు అలా దేశభక్తి పెంచుకోవాలని సూచించారు. ప్రజల్లో దేశభక్తి, దైవభక్తి పెంచేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం నుంచి ఏప్రిల్ 28 వరకు శ్రీ లలితా రహస్య, సహస్రనామాలపై 86వ జ్ఞానయజ్ఞ ప్రవచనాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Sree Peetham's Paripoornananda Swamy has questioned parties and leaders on Sunday evening over Hindutva issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X