వైఎస్ వాటా ఎంత?: బాబు, మీరు గడ్డంతో..: నారాయణ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994 నుంచి 2013 వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందే అన్నారు. తమ హయాంలో చార్జీల రూపేణా రూ.1600 కోట్లు పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు పెంచిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి రాష్ట్రంలో 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. కరెంటు కొనుగోలు అవినీతిలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల వాటా ఎంతని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి ఈ నెల 9 వరకు గడువిస్తున్నామని, బంద్లోగా కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాటం చేస్తామని అని వామపక్షాలు అల్టిమేటం జారీ చేశాయి. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు సామూహిక దీక్షలు చేపట్టాయి. కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు.
చంద్రబాబు విధానాల వల్లే ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని చెబుతున్నారని, ప్రతి దానికీ ఆయన పేరు చెప్పొద్దని,తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉండి ఆయన చేసిన చట్టాల్లో మీరు మార్పులు ఎందుకు చేయలేదని, చేతకాక కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాబులాగే చేయాలనుకుంటే మీరు కూడా గడ్డం పెంచి, జనంలో, రోడ్లపై తిరగాల్సి వస్తుందని ఆక్షేపించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్












Click it and Unblock the Notifications