వైఎస్ వాటా ఎంత?: బాబు, మీరు గడ్డంతో..: నారాయణ
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1994 నుంచి 2013 వరకు విద్యుత్ వ్యవస్థపై రాష్ట్రంలో చర్చ జరగాల్సిందే అన్నారు. తమ హయాంలో చార్జీల రూపేణా రూ.1600 కోట్లు పెంచితే, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు పెంచిందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలతో పరిశ్రమలు మూతపడి రాష్ట్రంలో 10 లక్షలమంది ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. కరెంటు కొనుగోలు అవినీతిలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డిల వాటా ఎంతని ప్రశ్నించారు.
ప్రభుత్వానికి ఈ నెల 9 వరకు గడువిస్తున్నామని, బంద్లోగా కరెంట్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే, ప్రభుత్వాన్ని గద్దె దించేలా పోరాటం చేస్తామని అని వామపక్షాలు అల్టిమేటం జారీ చేశాయి. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ వామపక్షాలు సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ ముందు సామూహిక దీక్షలు చేపట్టాయి. కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ గుర్తు చేశారు.
చంద్రబాబు విధానాల వల్లే ఇప్పుడు కరెంటు చార్జీలు పెరుగుతున్నాయని చెబుతున్నారని, ప్రతి దానికీ ఆయన పేరు చెప్పొద్దని,తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉండి ఆయన చేసిన చట్టాల్లో మీరు మార్పులు ఎందుకు చేయలేదని, చేతకాక కుంటిసాకులు చెబుతున్నారని మండిపడ్డారు. బాబులాగే చేయాలనుకుంటే మీరు కూడా గడ్డం పెంచి, జనంలో, రోడ్లపై తిరగాల్సి వస్తుందని ఆక్షేపించారు.