సిటీలో భారీ వర్షం: విజయమ్మ, బిజెపి దీక్ష కొనసాగింపు

ఆయా ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. గాంధీ నగర్లో పిడుగు పడింది. ప్రమాదం తప్పింది. ఎవరికీ ఏమి కాలేదు. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్లో భారీ వర్షంతో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. వర్షం కురిసిన పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలిపివేశారు.
వర్షంలోనే జగన్ పార్టీ, బిజెపి దీక్ష
విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, ఆ పార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలు వర్షంలోనే తమ దీక్షను కొనసాగిస్తున్నారు. వైయస్ విజయమ్మ ఆమరణ దీక్ష ప్రారంభించగా, బిజెపి నిరవధిక దీక్ష చేస్తోంది. వారు దీక్ష చేస్తున్న ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న దీక్షను కొనసాగిస్తున్నారు.
మెదక్లో వడగళ్ల వాన
మెదక్ జిల్లాలో మంగళవారం ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలరాలాయి. పలుచోట్ల చెట్లు కూలడం వల్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా, రాగల ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.












Click it and Unblock the Notifications