పండ్లు, పాలు ఇవ్వండి: ఢిల్లీ గ్యాంగ్రేప్ నిందితుడు

బిఎ ప్రథమ సంవత్సరం విద్యార్థి అయిన తన క్లయింట్కు గ్రూప్ సి ఉద్యోగం పరీక్ష ఉందని, ఈ మేరకు అతనికి లేఖ వచ్చిందని శర్మ న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి తన క్లయింట్కు వార్తాపత్రికలు అందుబాటులో ఉంచాలని కూడా కోరారు.
ఢిల్లీలో నిరుడు డిసెంబర్ 16వ తేదీన నడుస్తున్న బస్సులో ఓ వైద్య విద్యార్థినిపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. బస్సులో ఆ తన మిత్రుడితో కలిసి వెళ్తుండగా ఆమెపై శర్మతో పాటు మిగతావారు సామూహిక అత్యాచారం జరిపారు.
అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థిని డిసెంబర్ 29వ తేదీన సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ సంఘటనతో ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications