భార్య దాడి చేసిందని మంత్రి: వేధిస్తున్నాడని యామిని

ఈ నేపథ్యంలో మంత్రి పదవికి గణేష్ కుమార్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఊమన్ చాందీకి పంపించారు. కాంగ్రెసు-యూడిఎఫ్ సంకీర్ణ కూటమిలోని ప్రభుత్వంలో గణేష్ కుమార్ కేరళ కాంగ్రెసు పార్టీకి చెందినవారు. యామిని సోమవారం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. గత దశాబ్దంగా తనను వేధిస్తున్నారని ఆమె ఈ సందర్భంగా ఆరోపించారు.
యామిని ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా తప్పు పట్టారు. ముఖ్యమంత్రి తన భర్తపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వెనుకేసుకొస్తున్నారని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో యూడిఎప్ కూటమిలోని కేరళ కాంగ్రెసు మూడు స్థానాల్లో గెలుపొందింది. యూడిఎప్ కూటమిలో ఇది మైనర్ పార్టనర్. 46 ఆరేళ్ల గణేష్ కుమార్ నటుడి నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. మొదట రాజీనామా చేసేందుకు గణేష్ ఒప్పుకోలేదు.
ఆ తర్వాత పట్టుబట్టడంతో రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఆమోదించారు. గణేష్ కుమార్ సతీమణి యామిని రాతపూర్వకంగా తన భర్త పైన ఫిర్యాదు చేశారని, కేసును చేపట్టమని డిజిపిని ఆదేశించానని చెప్పారు. కాగా, గణేష్ కూడా పోలీసు స్టేషన్లో ప్రతిగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం గణేష్ ఫ్యామిలీ కోర్టులో తనపై భార్య దాడి చేసిందంటూ అందుకు సంబంధించిన ఫోటోలతో పాటు విడాకుల పిటిషన్ దాఖలు చేశారు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications