వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంధించి, మహిళపై అత్యాచారం చేసి అమ్మేసిన పూజారి

By Pratap
|
Google Oneindia TeluguNews

Molestation
భోపాల్: ఓ పూజరి ఓ వివాహిత మహిళను అపహరించి, బందీని చేసి అత్యాచారం చేశాడు. ఆపై ఆమెను అమ్మేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని ఛత్రాపూర్ జిల్లా పఠర్వా గ్రామంలోని పూజూరి బాల ప్రసాద్ శుక్లా, అతని అనుచురుడు దేవేంద్ర శుక్లా జనవరి 17వ తేదీన తనపై అత్యాచారం చేశారని 33 ఏళ్ల మహిళ ఆరోపించింది.

ఆమె కుమారుడిని, ఆమెను బాలప్రసాద్ శుక్లా అపహరించాడని, ఆమెపై అత్యాచారం చేశాడని, ఆ తర్వాత టికంగఢ్‌ జిల్లాలోని పిప్రా గ్రామానికి చెందిన విమల్ యాదవ్, పప్పూ యాదవ్, వీరేంద్ర యాదవ్ అనే ముగ్గురికి 40 వేల రూపాయలకు అమ్మేశాడని ఆరోపణలు వచ్చాయి.

కనిపించకుండా పోవడంతో ఆమె కోసం ఆమె సోదరుడు గాలింపు ప్రారంభించాడు. దాంతో ఆమెను టికంగఢ్‌ జిల్లా పిప్రా గ్రామంలో అతను కనిపెట్టాడు. ఆమె ఐదేళ్ల కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆమెను పోలీసుల సహకారంతో రక్షించాడు.

మహిళను కొనుక్కున్న ముగ్గురు సోదరులు కూడా ఆమెను బందీగా ఉంచుకుని సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పూజారి, అతని అనుచురడితో పాటు ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

English summary
A woman was allegedly kidnapped by the priest Bala Prasad Shukla on January 17 and was raped by him and his accomplice Devendra Shukla at Patharva village in Madhya Pradesh, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X